నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం
NLG: నార్కెట్పల్లిలో రోడ్డు విస్తరణ పనుల కారణంగా విద్యుత్ సరాఫరాలో అంతరాయం ఉండనుంది. విద్యుత్తు నియంత్రికలు, తీగలు మారుస్తుండటంతో పట్టణంలో నేడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం1 గంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని శుక్రవారం విద్యుత్ శాఖ ఏఈ చంద్రశేఖర రావు ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.