ఇవాళ పులివెందులకు జగన్
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఇవాళ భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 22న ఉదయం పులివెందుల నుంచి లింగాల మండలం ఇప్పట్ల వెళ్తారు. 23న ఉదయం పర్యటన ముగించుకుని బెంగళూరుకు తిరుగు పయనమవుతారు.