గ్యాస్ ఏజెన్సీ ఆకస్మిక తనిఖీ
VZM: జేసీ ఎస్. సేధు మాధవన్ మంగళవారం స్వామి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఏజెన్సీ మూతపడటంతో గ్యాస్ సరఫరా నిలిచిపోయి వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకుండా గ్యాస్ సిలిండర్లను నిరంతరం సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.