ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

కర్నూలు: వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాగల 4, 5 రోజుల్లో జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదని కలెక్టర్ ప్రజలకు సూచించారు.