వైకుంఠ ద్వార దర్శనాల ఈ-డిప్కు భారీగా రిజిస్ట్రేషన్లు
AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాల ఈ-డిప్కు రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి. 24 గంటల్లో ఈ-డిప్కు 6 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చాయి. 1+3 విధానంలో మొత్తం 15.50 లక్షల మంది భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 1వ తేది వరకు ఈ-డిప్ రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి.