ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
జగిత్యాల జిల్లాలో 11వ తేదీన జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. బుధవారం మేడిపల్లి, కథలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు బీ.ఎస్. లత, బీ. రాజ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.