దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా ఇరాన్ మరోసారి డ్రోన్ దాడి చేసింది. దీంతో ఎయిర్పోర్ట్ వ్యాప్తంగా పెద్దఎత్తున పొగ కమ్ముకుంది. దాడి నేపథ్యంలో విమానాశ్రయంలోని ప్రయాణికులంతా భయాందోళలతో పరుగులు తీశారు. దాడి తర్వాత అప్రమత్తమైన అధికారులు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను యాక్టివేట్ చేశారు. అనంతరం అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు.