ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ.. రెండు ముక్కలైన ట్రాక్టర్!
HYD: శామీర్పేట పీఎస్ పరిధిలోని తూంకుంట మున్సిపాలిటీ అలియాబాద్ చౌరస్తా వద్ద, హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిపై వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది. ఈప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్, మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ ఉత్తమ్ సోనె(31) అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి జగదేవ్కు తీవ్రగాయాలయ్యాయి.