'పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందాలి'
NGKL: పేద విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, మండల విద్యాశాఖ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీకి రూ.45 మించి వసూలు చేయకూడదన్నారు.