వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

NRML: బైంసా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన వైకుంఠ ఏకాదశి వేడుకల్లో MLA రామారావు పటేల్ పాల్గొని ఆలయంలో పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చిన శ్రీనివాసును దర్శించుకున్నారు. MLA మాట్లాడుతూ.. వెంకటేశ్వరుని కటాక్షం అందరికీ ఉండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు MLAను ఆలయ మర్యాదలతో స్వాగతించారు.