అగ్నిమాపక శాఖ బలోపేతానికి చర్యలు
AKP: అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం అమరావతి సచివాలయంలో అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త అగ్నిమాపక వాహనాలు సీఎం చంద్రబాబుతో ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్షించారు. తొలి దశలో రూ.18 కోట్లతో 25 అత్యధిక ఫైర్ ఇంజన్లు అందజేస్తామన్నారు.