మద్నూర్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టిన సోయాబిన్ ధర

మద్నూర్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టిన సోయాబిన్ ధర

KMR: మద్నూర్ మార్కెట్‌లో సోయాబిన్ ధర తగ్గుముఖం పట్టింది. గురువారం క్వింటా రూ.4,500 ధర పలుకుతోందని అడత్ వ్యాపారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా సోయాబిన్ పంటలో మట్టి శాతం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో 2 శాతం మాత్రమే మట్టి ఉండాలనే నిబంధన ఉండటంతో, కేంద్రంలో అమ్మిన సంచులు సైతం గోదాం నుంచి తిరిగి వస్తున్నాయి.