రేపు భారత్, సౌతాఫ్రికా తొలి T20
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య రేపటి నుంచి T20 సిరీస్ ప్రారంభం కానుంది. కటక్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టికెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. ఈ సిరీస్తో శుభ్మన్ గిల్, పాండ్యా, బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నారు. టెస్టు సిరీస్ సౌతాఫ్రికా, వన్డే సిరీస్ భారత్ గెలుచుకున్న నేపథ్యంలో, ఈ T20 సిరీస్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.