బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హుస్సేన్
కోనసీమ: బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మామిడికుదురుకి చెందిన నన్నేసా హుస్సేన్ను నియమించారు. ఈ మేరకు మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ భాషా నుంచి గురువారం ఆదేశాలు వెలువడ్డాయి. ఆయన బీజేపీ పార్టీ సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.