కలెక్టర్ గ్రీవెన్స్కు 39 అర్జీలు

SKLM: అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 39 అర్జీలు స్వీకరించామని కలెక్టర్ స్పష్టం చేశారు. సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.