తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లు నిండి.. శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,560 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,195 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.