ఇసుకపై సర్వాధికారాలు అటవీశాఖకు అప్పగింత

ఇసుకపై సర్వాధికారాలు అటవీశాఖకు అప్పగింత

MNCL: జన్నారం మండలంలో ఇసుకపై సర్వాధికారాలను ప్రభుత్వం అటవీ శాఖకు అప్పగించింది. జన్నారం కవ్వాల్ అభయారణ్య పరిధిలో ఉండడంతో అడవులు, సహజ వనరుల రక్షణలో భాగంగా అటవీ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 9 కిలోమీటర్ల వరకు ఉన్న సహజ వనరులపై అటవీ శాఖకు పూర్తి అధికారాలు లభించాయి. రెవెన్యూ శాఖ పరిధిలో ఉండే ప్రాంతాలపై కూడా అటవీ శాఖకు అధికారం లభించింది.