చంద్రగ్రహణం ఎఫెక్ట్.. కవాట బంధనంతో ఆలయం
ELR: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మార్చి 3న మూసివేస్తున్నట్లు కార్యనిర్వాహణ అధికారి భద్రాజీ ఆదివారం తెలిపారు. మార్చి 3న చంద్రగ్రహణం నేపథ్యంలో ఉదయం 6:20 గంటల నుంచి కవాట బంధనంతో ఆలయం ఉంటుందన్నారు. అదేరోజు రాత్రి 7:30 తర్వాత స్వామివారికి ఏకాంత శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మార్చి 4 నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిస్తారన్నారు.