ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించండి: మంత్రి

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించండి: మంత్రి

అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలో గురువారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని కూటమి నాయకులకు సూచించారు. అనంతరం ప్రజలకు అందుబాటులో ఉండేలా సేవలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.