వాటర్ ట్యాంక్ ఎక్కి సర్పంచ్ భర్త నిరసన

కోనసీమ: మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామంలో 10 రోజుల నుంచి తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోలేదని గ్రామ సర్పంచ్ అల్లు విజయలక్ష్మి భర్త సురేష్ బాబు శనివారం ఆందోళన చేపట్టారు. వాటర్ ట్యాంక్ పైకెక్కి నిరసన తెలిపారు.