సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన కార్యక్రమం
NTR: నందిగామలో సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ వైవిఎల్ నాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ మహతి, గాంధీ సెంటర్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. హెల్మెట్ ధరించడం, అతివేగం నివారించడం, వాహన పత్రాలు వెంట ఉంచుకోవడం తప్పనిసరి అన్నారు.