'జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి'
ప్రకాశం: కనిగిరి కోర్టు ఆవరణలో ఈ నెల 13వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్పై న్యాయవాదులు కక్షిదారులకు అవగాహన కల్పించాలని జూనియర్ సివిల్ జడ్జి బి. రూపశ్రీ కోరారు. సోమవారం కోర్టులో న్యాయవాదులతో ఆమె సమావేశం నిర్వహించారు. కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోనేటట్లు చూడాలని న్యాయ వాదులకు సూచించారు. లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని కోరారు.