ఆదిశక్తి రూపంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

ఆదిశక్తి రూపంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆదిశక్తి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయాన్నే అమ్మవారి శిలా విగ్రహానికి ఆలయ అర్చకులు తల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత అమ్మవారిని ఆదిశక్తి రూపంలో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు మారెమ్మను దర్శించగా అర్చకులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.