ఇరాన్ దౌత్యవేత్తకు ఘన ‘బాహుబలి’ స్వాగతం
E.G: రాజమండ్రిలో ఇరాన్ దౌత్యవేత్తకు ఘన స్వాగతం లభించింది. భారత్లో ఇరాన్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ గురువారం నగరాన్ని సందర్శించి మస్జిద్-ఎ-జహేరాలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురుచి PRO వర్మ ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. గోదావరి ఆతిథ్యానికి ప్రతీకగా ప్రసిద్ధ ‘బాహుబలి కాజా’తో పాటు మిఠాయిలను బహుమతిగా అందించారు.