గల్ఫ్ నుంచి తిరిగొస్తున్న భారతీయులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి భారతీయులు తిరిగొస్తున్నారు. అబుదాబి నుంచి ఢిల్లీ, బెంగళూరుకు విమానాలు చేరుకున్నాయి. దుబాయ్ నుంచి మరో విమానం భారత్కు చేరుకుంది. జెడ్డా నుంచి మరిన్ని ప్రత్యేక విమానాలు వచ్చాయి. 10 విమానాలను నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది.