ఉద్యోగాల పేరుతో మోసం.. ఐదుగురికి జైలు శిక్ష

ఉద్యోగాల పేరుతో మోసం.. ఐదుగురికి జైలు శిక్ష

VSP: ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురు యువతను మోసం చేసిన కేసులో ఐదుగురికి విశాఖ నాల్గవ అదనపు న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఎంవీపీ పోలీసుల వివరాల ప్రకారం.. 2021లో డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా కూడా విధించింది.