మంత్రి పయ్యావుల కేశవ్ నేటి పర్యటన వివరాలివే

మంత్రి పయ్యావుల కేశవ్ నేటి పర్యటన వివరాలివే

ATP: మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం అనంతపురంలో పర్యటించనున్నారు. ఉదయం రాంనగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి అందుబాటులో ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి విద్యుత్, హంద్రీనీవా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.