గోదావరిలో మునిగిన భక్తులను కాపాడిన గంగపుత్రులు

NRML: భద్రాచలానికి చెందిన ఆరుగురు భక్తులు సరస్వతి అమ్మవారి దర్శనానికి మంగళవారం బాసరకు వచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా ఇద్దరు భక్తులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అక్కడ ఉన్న గంగపుత్రులకు సమాచారం అందించారు. వెంటనే మునిగిన భక్తులను కాపాడి బయటకు తీసుకువచ్చారు. దీంతో ప్రాణాలను కాపాడిన గంగపుత్రకు ధన్యవాదాలు తెలిపారు.