దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీగా విశాఖ
విశాఖపట్నం వద్ద దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి రూపురేఖలు ఖరారయ్యయి. ఢిల్లీలో నారా లోకేష్, జీఎంఆర్ అధికారులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భోగాపురం ఎయిర్పోర్ట్ను కేంద్రంగా చేసుకుని ఏరో-సిటీ క్లస్టర్గా వేల కోట్లతో అభివృద్ధి, పైలట్లు, ఇంజనీర్లు సహా వేలాది ఉద్యోగాలు, విదేశీ విశ్వవిద్యాలయాలు రానున్నాయన్నారు.