ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం పెంపు

ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం పెంపు

KNR: జమ్మికుంట పట్టణంలోని మేధారు వాడా ప్రాంతంలో ఉన్న 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను 160 కేవీఏకు విద్యుత్ అధికారులు అప్ గ్రేడ్ చేశారు. వేసవిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని నిరంతర సరఫరా కోసం ఈ చర్య చేపట్టారని అధికారులు తెలిపారు. ఏఈ జమ్మికుంట, వార్డ్ కౌన్సిలర్ చింతల శ్రీనివాస్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు.