ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికి సీఐడీ నోటీసులు
KNR: హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికి తెలంగాణ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఆదేశించింది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర గొడవ కేసులో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, శాంతిభద్రతలకు భంగం కలిగించిన కారణంగా సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈ ఘటన విచారణలో మొత్తం కలిపి 16 మంది బీఆర్ఎస్ నాయకులకు సీఐడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.