కరాటే పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు

కరాటే పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు

KNR: కరీంనగర్‌లో ఇంటర్నేషనల్ షావోలిన్ కుంగ్ ఫూ బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీలలో మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌కు చెందిన కరాటే విద్యార్థులు సత్తా చాటారు. జగిత్యాల జిల్లా నుంచి 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో బండలింగాపూర్‌కు చెందిన 18 మంది వివిధ విభాగాలలో 10 బంగారు, పతాకాలు పొందారు.