VIDEO: రైల్వే స్టేషన్లో పేలిన బాంబు
TG: భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్లో బాంబు కలకలం రేపింది. కొందరు దుండగులు ప్లాట్ఫామ్పై సంచిని వదిలి వెళ్లారు. ఈ క్రమంలో ఆ సంచిలో ఉన్న బాంబును ఓ కుక్క కొరకడంతో.. అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో కుక్క మృతి చెందగా.. ప్రయాణికులు పరుగులు తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.