రూ. 10 లక్షల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
NDL: సిరివెళ్ల గ్రామానికి చెందిన రిజ్వాన్కు రెండు కిడ్నీలు చెడిపోవడంతో బాధితులు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను కలిసి తమ సమస్యను వివరించారు. మంగళవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రూ. 10 లక్షల రూపాయల ఎల్ఓసీ చెక్కును మంజూరు చేయించి ఎమ్మెల్యే బాధితులకు అందజేశారు. బాధితులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు కృతజ్ఞతలు తెలిపారు.