'లంబాడీలకు క్యాబినెట్లో స్థానం కల్పించాలి'
RR: గిరిజనుల హక్కుల కోసం, అస్తిత్వం కోసం పోరాడే సమయం ఆసన్నమైందని ఈనెల 25న జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి కార్యదర్శి మోహన్ నాయక్ పిలుపునిచ్చారు. షాద్నగర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాబినెట్లో బంజారాలకు స్థానం కల్పించాలని, చేవెళ్ల డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.