త్వరలో భారత్కు వెళ్తా: ట్రంప్
భారత్తో వాణిజ్య చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. భారత్ చాలా వరకు రష్యా ఆయిల్ కొనుగోలును తగ్గించిందని తెలిపారు. ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడినప్పుడు భారత్కు రావాలని ఆహ్వానించారని.. త్వరలో ఢిల్లీకి వెళ్తానని చెప్పారు. వచ్చే ఏడాది భారత్కు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.