కదిరి నరసింహస్వామి ఆలయంలో నేడు ప్రత్యేక సేవలు
సత్యసాయి: కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య అభిషేక, స్వర్ణకవచ సేవలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు శ్రీవారికి ఆర్జిత కల్యాణోత్సవం ఉంటుంది. భక్తులకు స్వామివారి సర్వ దర్శనం ఉదయం 6 నుంచి 6.30, 9 నుంచి 2.30, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు కల్పిస్తామని అధికారులు తెలిపారు.