డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ మహిళ అరెస్ట్
HYD: సికింద్రాబాద్లో డ్రగ్స్ గుట్టురట్టు అయింది. డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 7.5 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో గ్రాము రూ.15,000కు కొనుగోలు చేసిన డ్రగ్స్ను హైదరాబాద్లో రూ.30,000కు విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.