అఖండ-2 టికెట్ @రూ.5 లక్షలు
బాలయ్య తాజాగా నటించిన అఖండ-2 మూవీ టికెట్ను చిత్తూరు కూటమి శాసన సభ్యులు గురజాల జగన్ మోహన్ రూ.5 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ టికెట్ను బాలయ్య అభిమానులంతా కలిసి ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా అఖండ 2 సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు ఫ్యాన్స్కు చెప్పారు. కాగా, ఈ మూవీలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.