వర్షాల నేపథ్యంలో పోలీసుల హెచ్చరిక

NGKL: రాబోయే మూడు రోజులు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు పోలీసులు సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ప్రవహిస్తున్న వాగులు దాటే ప్రయత్నం చేయకూడదని, నిండుగా ఉన్న చెరువుల వైపు వెళ్ళకూడదనీ చెప్పారు.