ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ
PLD: సత్తెనపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్లో అయ్యప్ప స్వామి 16వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తి భావంతో నిర్వహిస్తున్న ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సత్సంకల్పాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.