గద్వాల్ రాజవంశీయురాలు డా. సుహాసినిరెడ్డి మృతి
GDWL: జోగులాంబ గద్వాల్ కృష్ణారెడ్డి బంగ్లాకు చెందిన రాజవంశీయురాలు డాక్టర్ సుహాసినిరెడ్డి (85) గురువారం తెల్లవారుజామున నిద్రలో మరణించినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ఆమె మరణం పట్ల జిల్లా ప్రజలు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలు హైదరాబాద్లో జరుగుతాయని ఆమె కుమారుడు లక్ష్మీ చెన్నకేశవరెడ్డి తెలిపారు.