దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. తమిళనాడు ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కేరళలో 273 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, కర్ణాటకలో 36, ఢిల్లీలో 23 కొవిడ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు మాస్కులు ధరించాలని, గుంపులుగా గుమికూడవద్దని ప్రజలకు సూచించారు.