కాంగ్రెస్ పార్టీలో చేరిన రుద్రవరం సింగిల్ విండో ఛైర్మన్

SRCL: వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం సింగిల్ విండో ఛైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.