మదనాపురంలో భారీగా ఇసుక డంపుల సీజ్!

మదనాపురంలో భారీగా ఇసుక డంపుల సీజ్!

WNP: మదనాపురం మండలం కరివేన గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 30 ట్రాక్టర్ల ఇసుకను రెవెన్యూ అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఊకచెట్టు వాగు నుంచి ఇసుకను తరలించి డంపు చేస్తున్నారన్న సమాచారంతో తహశీల్దార్ జె.కె. మోహన్ దాడులు నిర్వహించారు. సీజ్ చేసిన ఇసుకను తదుపరి చర్యల కోసం పోలీసులకు అప్పగించారు.