ఖాళీ స్థలాల పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్

ఖాళీ స్థలాల పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్

కాకినాడ నగరంలోని ఖాళీ స్థలాలపై పన్ను వసూలు కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించినట్లు కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కె . శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన గైగులపాడు, కర్ణం గారి సెంటర్ పరిసర ప్రాంతాలను పర్యటించి, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్త పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 25 లోగా పెండింగ్ పన్నులు చెల్లించాలని సూచించారు.