ఈ నెల 31 నుంచి సీఐటీయూ సభలు: ఆర్సీపీ

ఈ నెల 31 నుంచి సీఐటీయూ సభలు: ఆర్సీపీ

కృష్ణా: డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతున్న అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సీపీ రెడ్డి కోరారు. గుడివాడలోని బాపూజీ నగర్‌లో ఆయన సీఐటీయూ జెండాను ఈరోజు ఆవిష్కరించారు. ప్రజల పోరాటాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును నిరంకుశంగా ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు.