నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాల సమర్పణ
NLG: చిట్యాలలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునః నిర్మాణమై 23 ఏళ్లు ముగిసిన సందర్భంగా.. బొబ్బలి పాండు రెడ్డి తన బృందం, కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు, వడి బియ్యం సమర్పించారు. పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని, నిర్మాణ కమిటీ వేడుకుంది.