బీటెక్ ఫైనల్ సెమిస్టర్లో 99.30 శాతం ఉత్తీర్ణత

KDP: వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ ఫైనల్ సెమిస్టర్ ఫలితాలు వైవీయూ వీసీ తన ఛాంబర్లో శుక్రవారం విడుదల చేశారు. 99.30 శాతం మంది విద్యార్థులు పాసయ్యారని ప్రొ. శ్రీనివాసరావు వెల్లడించారు. బీటెక్లోని ఆరు బ్రాంచ్లకు కలిపి 236 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 234 మంది ఉత్తీర్ణత సాధించారని, ఇద్దరు మాత్రమే ఫెయిల్ అయ్యారని తెలిపారు.