కోదండ రామయ్యకు స్నపన తిరుమంజన సేవ
KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో టీటీడీ అధికారులు శనివారం స్నపన తిరుమంజన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి పట్టు వస్త్రాలు, గజమాలలు సమర్పించారు. అర్చకులు శాస్త్రోత్తంగా అభిషేకాలు నిర్వహించి స్వామి వారిని సుందరంగా అలంకరించారు. భక్తులకు దర్శనార్థం అనుమతింపజేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.